ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరులో విషాద ఘటన..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 22, 2020, 04:57 PM

చిత్తూరులో కరోనా బారినపడిన భార్యభార్తలు ఆస్పత్రికి బయలు దేరుతూనే గుండెపోటుతో చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే పెద్ద తిప్ప సముద్రం మండల కేంద్రం నుంచి కరోనా బాధిత వృద్దుడు 108 వాహనంలో మదనపల్లె కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. భర్త మరణ వార్త తెలుస్తూనే అదే 108 వాహనంలో ఉన్న బాధితుడి భార్య (65) కూడా గుండె పోటుతో మృతి చెందింది. ఇద్దరి మృత దేహాలు స్వగ్రామానికి తరలించారు. భార్య భర్తలకు కరోనా పాజిటీవ్‌ గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ వచ్చింది. ముందుగా భార్య వెళ్లి అంబులెన్స్‌లో కూర్చుంది. కానీ తాను ఆస్పత్రికి వెళ్లేది లేదని తనకు బాగుందని వెళ్లనని పట్టు బట్టాడు భర్త. నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా అంబులెన్స్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు బంధువులు. దీంతో అతనికి గుండెపోటు వచ్చి అంబులెన్స్ లోనే చని పోయాడు. కళ్లెదుటే భర్త చనిపోవడం జీర్ణించుకోలేకపోయిన భార్యకు కూడా గుండెపోటు వచ్చి చనిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com