కేంద్రం 2 వేల నోట్లను రద్దు చేయనున్నారని, తమ దగ్గర ఉన్న రెండు వందల కోట్లను తక్కువకే ఇస్తామంటూ మోసం చేసేందుకు యత్నించిన ముఠా. రెండు వేల రూపాయల నోట్లు నిల్వ ఉన్న వీడియోను చూపించి మోసం చేస్తోన్న ముఠా. 90 లక్షల రూపాయల విలువైన 5 వందల రూపాయల నోట్లు ఇస్తే కోటి రూపాయిల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఇస్తామని కాకినాడ కు చెందిన నాగ ప్రసాద్ అనే వ్యక్తి ని నమ్మించిన ముఠా. అనుమానం వచ్చి నాగ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడ్డ నకిలీ కరెన్సీ ముఠా మోసం. విశాఖ జిల్లాకు చెందిన నలుగురు ముఠా సభ్యుల తో పాటు కాకినాడ కు చెందిన మరొక నిందితుడిని అదుపులోకి తీసుకున్న సర్పవరం పోలీసులు