ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. తీసుకెళ్లి నదిలో తోసేశాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 22, 2020, 11:25 AM

కర్నూలు: ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. తీసుకెళ్లి నదిలో తోసేశాడు.  అనాథ బాలికను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. ఇంతలోనే మనస్పర్థలు.. ఆమెను నమ్మించి తీసుకెళ్లి నదిలో తోసేసిన భర్త.. కర్నూలు జిల్లాలో దారుణం.ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. కొన్నేళ్లు భార్యను బాగానే చూసుకున్నాడు. ఇద్దరి మధ్య చిన్న, చిన్న సమస్యలు వచ్చాయి.. కోపంతో ఆమెను నమ్మించి మోసం చేసి నదిలో తోసి చంపేందుకు ప్లాన్ చేశాడు. ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు పత్తి భాస్కర్‌ హైదరాబాదులోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడే రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుని 2016లో వివాహం చేసుకున్నారు.


ఇద్దరి కాపురం సజావుగా సాగింది.. ఆ తర్వాత కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్యను వదిలించుకోవాలని భాస్కర్ భావించాడు. ఈ నెల 16న భార్యను తీసుకుని స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వెళదామని నమ్మబలికాడు. ఆమెను తీసుకుని బైక్‌పై బయలుదేరాడు.. గ్రామ సమీపంలోని కుందూనది వంతెనపైకి చేరుకున్న తర్వాత బైక్‌ ఆపాడు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నాటకమాడి భార్యను నదిలోకి తోసేశాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు తను కూడా బైక్‌తో సహా నదిలోకి దూకాడు. అతనికి ఈత రావడంతో కొంతదూరం తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో రామలక్ష్మి కొట్టుకుపోయింది.రామలక్ష్మి కేకలు విన్న రైతులు నదిలోకి దూకి ఆమెను రక్షించారు. తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తన భర్త చంపే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com