రూరల్ మండలం కోపల్లె గ్రామంలో కిరాణా షాపు ను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ చేయూత ద్వారా వచ్చిన 18750 నగదు తో కారుమంచి మేరీసుధ కిరాణా షాపు నిర్వహించడం ఆనందంగా ఉందని అదేవిధంగా రాష్ట్రంలో వైయస్సార్ చేయూత ద్వారా ప్రజలు పలు అవసరాల పై వినియోగించుకుంటున్నారని ఆయన అన్నారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కర్లపూడి నాగరాజు, కందుల రాంబాబు, కారుమంచి కిషోర్ బాబు, కట్టా అనిల్, పాముల మధు, కారుమంచి పాలు, కటారి హరీష్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.