ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిక్లరేషన్ పై సంతకం చేయడానికి సీఎం జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి : తులసిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 20, 2020, 04:02 PM

అన్యమతస్తులు ఎవరైనా తిరుమల వస్తే శ్రీవారి దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎప్పటినుంచో అమల్లో ఉంది. అయితే ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో డిక్లరేషన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి. తాజాగా, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఘాటుగా స్పందించారు.


తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయడానికి సీఎం జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ డిక్లరేషన్ పై సంతకం పెడితే తాను హిందువునని తెలిసిపోతుందని భయమా? లేకపోతే, వెంకటేశ్వరస్వామిపై నమ్మకం, భక్తి లేకనా? అని వ్యాఖ్యానించారు. నమ్మకం లేకుండా తిరుమలకు వెళ్లడం ఎందుకని అన్నారు. ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘించాలని చూడడం సరికాదని హితవు పలికారు.


కాగా, డిక్లరేషన్ పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చినా విపక్షాలు మాత్రం వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com