గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం గోరుజవోలులో బాలుడి మిస్టరీ వీడింది. గ్రామ సమీపంలో ఉన్న వాగులో బాలుడు జశ్వంత్(8) మృతదేహాం లభ్యమైంది. అనుమానితుడు వీరాస్వామి ఇంకా పరారీలోనే ఉన్నాడు. వీరాస్వామి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. బాలుడు అదృశ్యంపై తల్లి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.