ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈనెల 25న ఉదయం 11 గంటలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నవరత్నాల అమలు వంటి అంశాలపై చర్చించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుత పరిణామంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించనున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇళ్ల స్థలాల పంపిణీపై కూడా చర్చించి ఓ నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.