ఐపీఎల్-13 సీజన్లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 163 పరుగుల టార్గెట్ను ఇచ్చింది. ఈ మ్యాచ్లో తొలుత సీఎస్కే టాస్ గెలవడం ద్వారా బ్యాటింగ్కు దిగిన ముంబైకు మంచి ఆరంభం లభించింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే రోహిత్ ఫోర్ కొట్టాడు. ఆపై డీకాక్కు కూడా బ్యాట్ ఝుళింపించాడు. వీరిద్దరూ నాలుగు ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించి రన్రేట్ను పదికి పైగా ఉంచారు. కాగా, మ్యాచ్ ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. సీఎస్కే స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన ఐదో ఓవర్ నాల్గో బంతికి రోహిత్(12) తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, క్వింటాన్ డీకాక్(33) ఆ తర్వాత ఓవర్లో పెవిలియన్ చేరాడు. పేసర్ సామ్ కరాన్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి డీకాక్(33) రెండో వికెట్గా ఔటయ్యాడు. డీకాక్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు. కరాన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డీకాక్.. వాట్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్(17), సౌరవ్ తివారీల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 44 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. అప్పుడు తివారీకి హార్దిక్ పాండ్యా కలవడంతో స్కోరు కాసేపు పరుగులు పెట్టింది. కానీ అది ఎంతోసేపు సాగలేదు. తివారీ,హార్దిక్లు వరుసగా పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన కృనాల్, పొలార్డ్లు కూడా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, జడేజా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు సాధించారు, సామ్ కరాన్, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్థేశించిన 163 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే సీఎస్కేకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపనర్లు మురళీ విజయ్(1), షేన్ వాట్సన్(4) వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. అయితే అంబటి రాయుడు నిలకడగా రాణిస్తూ అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. డుప్లెసిస్తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని అంబటి రాయుడు నెలకొల్పాడు. 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంబటి రాయుడు ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 17 ఓవర్లు పూర్తయ్యే సమయానికి చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. డుప్లెసిన్(44) అర్థశతకానికి చేరువయ్యాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ, డికాక్ శుభారంభాన్ని ఇచ్చారు. వారిద్దరూ కలసి మొదటి వికెట్కు 46 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. రోహిత్ శర్మ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆ వెంటనే డికాక్ 33 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవవ్ (17), సౌరభ్ తివారీ (42) పరుగులు చేశారు. పాండ్యా (14), పొలార్డ్ (18), పాటిన్సన్ (11) పరుగులతో మెరిపించినా, మిగిలిన వారు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్ 2, లుంగీ ఎంగిడి 3, జడేజా 2 వికెట్లు తీయగా, కరన్, చావ్లా చెరో వికెట్ పడగొట్టారు. చివరగా 19.2 ఓవర్లలో 166 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.