దక్షణ కొరియా మొబైల్ దిగ్గజం సాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎ, గెలాక్సీ ఎం సిరీస్ యొక్క ధరలను బాగా తగ్గించింది. చైనీస్ స్మార్ట్ ఫోన్లకు పోటాపోటీగా విడుదలవుతున్న గెలాక్సీ ఎ, గెలాక్సీ ఎం సిరీస్ మొబైల్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సాంసంగ్ సంస్థ గెలాక్సీ మొబైల్ ఫోన్ యొక్క ధరలను 1500 రూపాయల వరకు తగ్గించింది. గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది.
గెలాక్సీ ఎ71 సాంసంగ్ ధర రూ. 1,500 ధర తగ్గింపు తర్వాత దాని ధరను ₹ 30,999 నుండి రూ. 29,499 కు తగ్గింది. గెలాక్సీ ఎ51 8 జిబి వేరియంట్పై అదే మొత్తంలో ధరను తగ్గించింది. గెలాక్సీ ఎ51 ధర ఇప్పుడు 24,999 కి తగ్గింది. గెలాక్సీ ఎ 51 6 జిబి వేరియంట్ కూడా 1,000 ధర తగ్గింది. దీంతో దాని ద్వారా ప్రస్తుతం 22,999 కు తగ్గించబడింది.
గెలాక్సీ A31 లో 1,000 ధర తగ్గింపు తో పాటు అదనంగా 1,000 క్యాష్బ్యాక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దాంతో గెలాక్సీ ఎ31 ప్రస్తుత ధర రూ. 18,999 కు తగ్గించబడింది. క్యాష్బ్యాక్ ఆఫర్ అనేది కేవలం ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు, ఇఎంఐ లావాదేవీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాంసంగ్ గెలాక్సీ ఎ21 కూడా 1500 రూపాయల వరకు తగ్గాయి. ఈ ఫోన్ ఇప్పుడు 6GB వేరియంట్ ధర 16,499 వేల రూపాయలు ఉండగా... 4GB వేరియంట్కు రూ. 14,999 రూపాయలకు తగ్గించబడింది.
దీన్ని బట్టి చూస్తుంటే రెండు గెలాక్సీ ప్రీమియం ఫోన్లు, రెండు బడ్జెట్ గెలాక్సీ ఫోన్లపై ధరలు తగ్గాయని తెలుస్తోంది. గెలాక్సీ M01 మొబైల్ ఫోన్ల ధర 500 తగ్గగా దాని ప్రస్తుత ధర 9,499 గా ఉంది. గెలాక్సీ M01 కోర్ మొబైల్ ఫోన్ల పై కూడా ఐదు వందల రూపాయలు తగ్గింది. అయితే ఈ మొబైల్ ఫోన్ ధర ప్రస్తుతం 1GB వేరియంట్ రూ. 4,999 పలుకుతుండగా... 2GB వేరియంట్ ధర రూ. 5,999 గా ఉంది.