నర్సీపట్నం తాహసిల్దార్ ఎం.ఎ. శ్రీనివాస్ కు ఆకస్మికంగా బదిలీ అయింది. ఈ మేరకు జిల్లాలో 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ ను విశాఖ కలెక్టరేట్లో పర్యవేక్షుణిగా బదిలీ చేశారు. నర్సీపట్నం తాహసిల్దార్ గా అనకాపల్లి సివిల్ సప్లై డిప్యూటీ తాహసిల్దార్ గా పనిచేస్తున్న వై జయను పదోన్నతిపై నర్సీపట్నం తాహసిల్దార్ గా నియమించారు.