ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కోమటి జయరాంపై అయ్యన్న సంచలన ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 08:23 PM

ఆంధ్రప్రదేశ్‌ కార్మికశాఖ మంత్రి కోమటి జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా మీట్‌ నిర్వహించిన ఆయన మంత్రి, జగన్‌ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్‌ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం అవినీతిలో సీఎం జగన్‌కు పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు, ఇప్పటికే ఈఎస్‌ఐ స్కాములో అరెస్ట్‌ అయిన వ-14 కార్తీక్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఖరీదైన కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజున సందర్భంగా ఇచ్చారు. కారుకు ఫైనాన్స్ ‌చేయించి మరీ కార్తీక్‌ ఇచ్చారు. ఏ సంబంధంతో కారును


కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలి. మంత్రి మండలి నుంచి జయరాంను


తప్పించాల్సిందే. బీసీ నేతలను టచ్‌ చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com