ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 08:11 PM

నక్కపల్లి ఉపమాక క్షేత్ర లో శుక్రవారం ప్రారంభం కానున్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కోవడ్ కారణంగా ఏకాంతంగానే నిర్వహించనున్నారు. ఈనెల 27వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో వాహన సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.19వ తేదీ శనివారం రాత్రి 8 నుంచి తొమ్మిదిన్నర గంటలకు వరకు ధ్వజారోహణం జరుగుతోంది. 27వ తేదీ ఆదివారం తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో మూలవిరాట్, పరిహార దేవతలకు ప్రత్యేక పూజలు, నివేదనలు, సేవలన్నీ ఏకాంతంగానే జరుపుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com