నక్కపల్లి ఉపమాక క్షేత్ర లో శుక్రవారం ప్రారంభం కానున్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కోవడ్ కారణంగా ఏకాంతంగానే నిర్వహించనున్నారు. ఈనెల 27వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో వాహన సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.19వ తేదీ శనివారం రాత్రి 8 నుంచి తొమ్మిదిన్నర గంటలకు వరకు ధ్వజారోహణం జరుగుతోంది. 27వ తేదీ ఆదివారం తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో మూలవిరాట్, పరిహార దేవతలకు ప్రత్యేక పూజలు, నివేదనలు, సేవలన్నీ ఏకాంతంగానే జరుపుతారు.