ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజిబుల్ పోలిసింగ్ ద్వారా ప్రజలకు మరింత భద్రత: సీఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 07:57 PM

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రతిష్టాత్మకంగా విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని పట్టణ సిఐ శీలం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం మంగళగిరి సీఐ శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. ఆటోనగర్ లోని వివిధ ఐటి కంపెనీల్లో సుమారు 600 మంది యువతులు విధులు నిర్వహిస్తున్నారని, ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటోనగర్ లోని కూడళ్లలో  గస్తీలు నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు. తద్వారా ఈవ్ టీజింగ్ ను తగ్గించటంతో పాటు యువతుల్లో మనో స్థైర్యాన్ని నింపగలుగుతున్నామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com