ఎంతో చరిత్ర కలిగినటువంటి కర్నూలు జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి అధ్యక్షత వహించగా... ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి శేఖర్ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు సరైన ప్రాజెక్టు లేకపోవడం వల్ల ఎన్ని వర్షాలు పడిన కర్నూలు జిల్లాలో సంక్రాంతి దాటిందంటే సాగునీరు, తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కర్నూలు జిల్లా ప్రజల చిరకాల కోరిక వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం, అలుగు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి. చంద్రశేఖర్, నగర నాయకులు బాబయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.