ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాడు నేడులో భాగంగా బీసీ వసతి గృహాలను అభివృద్ధి పరచాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 07:21 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బీసీ వసతి గృహాలను అభివృద్ధి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అద్దె భవనాలలో నడుస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని బిసి విద్యార్థి పరిషత్ ప్రధాన కార్యదర్శి బండారి సురేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక కర్నూలు నగరంలోని బిసి వెల్ఫేర్ ఆఫీస్ నందు జిల్లా బిసి సంక్షేమ అధికారిని రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, రాయలసీమ యువజన వేదిక అధ్యక్షుడు బెస్త శ్రీనివాసులు, బిసీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం మోహన్, ఆర్.యు.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్ నాయుడుతో కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ... బిసి స్టడీ సర్కిల్స్ ను, అలాగే ప్రతీ జిల్లాకి బీసీ భవన్ లను నిర్మించాలని, బిసీ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న కమాటి, కుక్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయాలని, బిసీ వసతి గృహాల సమస్యలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరటం జరిగింది. సానుకూలంగా స్పందించిన జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి గారు మీరందించిన వినతిపత్రంలోని అంశాలను రాష్ట్ర ఉన్నత అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా విద్యార్థి సంఘాల నేతలు ఎం. రవి, ఎం. తరుణ్, సురేష్ యాదవ్, శివ శంకర్, అంజి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com