జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమనుద్దేశించి ఏఐఎస్ ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శులు శ్రీరాములు గౌడ్, ప్రకాష్ లు మాట్లాడుతూ... గాయత్రీ ఎస్టేట్ లోని నారాయణ పాఠశాలలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడీఎస్యుల ఆధ్వర్యంలో అడ్మిషన్లు జరుగుతున్న ఆఫీస్ దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది. నారాయణ పాఠశాల దగ్గర ఆందోళన చేయడంతో స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం పాఠశాల దగ్గరకు కల్లూరు మండల విద్యాశాఖ అధికారి ఆనంతయ్య యాదవ్ ని పంపించడం జరిగింది.దీనితో విద్యార్థి నాయకులతో కలిసి చేరుకొని అక్కడ అక్రమంగా జరుగుతున్న అడ్మిషన్లను స్వయంగా పరిశీలించడం జరిగింది.దీనితో విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారి ఆనంతయ్య యాదవ్ గారికి నారాయణ విద్యాసంస్థల పై చర్యలు కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈవిధంగానే జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని, జిల్లా డిఈఓ,ఆర్ఐఓ గార్లు చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమాలను ఆపే ప్రసక్తే లేదనివారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు సంఘాల నాయకులు మహేంద్ర, సూర్య ప్రతాప్, శరత్ కుమార్, విష్ణు, అబ్దుల్లా, దుర్గా ప్రసాద్, రవితేజ, అది, తదితరులు పాల్గొన్నారు