కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కరోనా విపత్తు కాలంలో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని, ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సెప్టెంబర్ 17 నుండి 22వ తేదీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పీ. నిర్మల, నగర కార్యదర్శి టీ.రాముడు, కర్నూలు వ్యవసాయ కూరగాయల మార్కెట్ యార్డ్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనాను అరికట్టడంలో ప్రజల ప్రాణాలు రక్షించడంలో ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు సిహెచ్. సాయి బాబా, చిన్న రోశయ్య, భాస్కర్, గోపాల్, పరశురాముడు, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, పరమేష్, వలి, పద్మా, నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.