కర్నూలు నగరంలోని రెండవ వార్డు లక్ష్మణ్ దాస్ వీధి నందు పందులు స్వైర విహారం చేస్తున్నాయని, మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తుందని తక్షణమే మున్సిపల్ కమిషనర్ పర్యటించి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రెండో వార్డులో ఇంటింటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి ప్రజలకు అనుకూలంగా పని చేయకపోగా, ఉన్న చట్టాలను మార్పుచేసి కార్మికులకు హక్కులు లేకుండా చట్ట సవరణలు చేసి బడా వ్యాపారవేత్తలకే అదానీ అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు.కేంద్రంలో బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి రెండూ కూడా బలపరచడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్ సిపి, తెలుగుదేశం, బీజేపీ విధానాలకు అడుగులకు మడుగులు వేయడం చాలా విచారకరమని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం కూడా ప్రజల పైన వేయడానికి ఈ మధ్యనే ప్రజలందరూ సతమతమవుతుంటే... ఆదుకోవాల్సిన ప్రజలను కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేసిందని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన కలిగించే అంశమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అందులో భాగంగానే 20వ తేదీ ప్రధాన కూడళ్లలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నామని, దీనిలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నగర కార్యదర్శి ఎం. రాజశేఖర్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు షరీఫ్ అబ్దుల్, అబ్దుల్ రెహమాన్, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.