తన అందంతో, మాటలతో అభిమానులను అలరించే యాంకర్ మాయంతి లాంగర్ ఐపీఎల్ 2020 ఎడిషన్లో కనిపించరు. ఈ ఐపీఎల్ నుంచి మాయంతి లాంగర్ తప్పించినట్లు లీగ్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాత ద్వారా తెలిపింది. ఈ మెగా ఈవెంట్కు యాంకర్లుగా వ్యవహరించే వారి జాబితాను తాజాగా విడుదల చేసిన స్టార్ అందులో మాయంతి పేరును చేర్చలేదు. ఐపీఎల్ అంటే కేవలం ఆటే కాదు గ్లామర్ గేమ్ కూడా. తెర ముందు కనిపించే ప్రతి విషయాని గ్లామర్ గా చూపించడంలో స్టార్ ఎప్పుడు వెనకాడదు. చీర్ గర్ల్స్ మొదలుకుని యాంకర్ల వరకు టోర్నీలో ప్రతీది ఆకర్షణనీయంగా కనిపిస్తోంది. అలాంటి ఈవెంట్లో మాయంతి లాంటి అందమైన యాంకర్ను తప్పించడం కొంత నిరాశపరిచే అంశమే. యాంకర్ జాబితాలో ముందు సీజన్లలో యాంకర్గా వ్యవహరించిన జతిన్ సప్రూ, అనంత్ త్యాగి, సంజనా గణేశన్, సుహాలి చందోక్లను ఈ సారి కూడా వారినే కొనసాగించింది. ముఖ్యంగా ఈ లీస్ట్లో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్ స్పోర్ట్స్ జర్నలిస్టు నెరోలీ మెడోస్ చోటు దక్కించుకున్నారు.