ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. కష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువుల, గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షితమై భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.