ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ప్రస్తుతం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని పెంచుతునట్టు తెలిపారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని రూ.5 వేలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని రూ.1000 నుంచి రూ.3 వేల రూపాయలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులలో ఆరోగ్య సేవలు మెరుగుపడాలన్నారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.