ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి తల్లీదండ్రులు కోరుకుంటారు. ఉన్నత చదువులు చదివించాలని, మంచి అబ్బాయితో పెళ్లి చేసి పంపించాలని ఇలా ఎన్నో కలలు కంటారు. దానికోసం పైసా.. పైసా కూడబెడతారు. నెలనెలా సేవింగ్స్ అకౌంట్లలో జమ చేస్తుంటారు. కానీ ఏ ఆర్థిక అవసరమో ముందుకొచ్చి వాటిని ఖర్చు చేసేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ బాధ లేదు. ఆడపిల్లల కోసం ప్రభుత్వమే మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం ఆడపిల్లలకు రూ .70 లక్షలకు పైగా అందిస్తుంది.ఈ స్కీమ్ను ప్రభుత్వం 2015లోనే ప్రవేశపెట్టింది ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. ఆడపిల్లల భవిష్యత్తుకి ఆర్థిక భరోసానిస్తుంది. ఆడ పిల్ల పుట్టిన తర్వాత నుంచి ఆమెకు పది సంవత్సరాల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా ఖాతాను తెరవచ్చు. కనీసం 250 రూపాయలతో ఈ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. సంవత్సరానికి కనీసం రూ.250లు డిపాజిట్ చేయాలి. ఏడాదికి గరిష్ఠంగా లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. అంతంకటే ఎక్కువగా డిపాజిట్ చేయకూడదు. ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాలి. నేరుగా డబ్బును, లేదా చెక్కు, డీడీ రూపంలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు.డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు. ఎప్పుడైనా ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతాను డిఫాల్ట్ అకౌంట్గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి రీ స్టార్ట్ చేయడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఒక వేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో లక్షా 50 వేలు కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా తీసేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఖాతాలో ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 15 సంవత్సరాల పాటు పొదుపు చేస్తే 21 సంవత్సరాల పూర్తైన తర్వాత రూ. 46,800 పొందవచ్చు. అలాగే సంవత్సరానికి లక్షన్నర చొప్పున 15 సంవత్సరాల పాటు జమ చేస్తే 21 సంవత్సరాల తర్వాత రూ. 70,20,000 పొందవచ్చు.ఈ ఖాతా తెరవాలంటే అమ్మాయి కచ్చితంగా భారతీయ పౌరురాలై ఉండాలి. తల్లిదండ్రులు లేదా గార్డియన్ రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంటుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతినిస్తారు. ఇందుకోసం వైద్యపరమైన పత్రాలు అందించాలి. దత్తత తీసుకున్న బాలిక పేరుపై కూడా ఈ ఖాతా తెరవచ్చు. బాలిక పదేళ్ల వయసు నుంచి ఖాతాను స్వయంగా నిర్వహించుకోవచ్చు.ఈ ఖాతా తెరించేందుకు వ్యక్తిగత గుర్తింపు పత్రం, అడ్రస్ ఫ్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి ఖాతాను ఆన్లైన్లో ప్రారంభించేందుకు అవకాశం లేదు. ఈ ఖాతాను పోస్టాఫీసులో తెరవచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెడ్ఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ల్లో ఎక్కడైనా ఈ ఖాతాను పొందవచ్చు. ఈ బ్యాంకులు సుకన్య సమృద్ధి ఖాతాలకు ఆన్లైన్ లావాదేవీలు జరుపుకునే వెసులుబాటును అందిస్తున్నాయి.ప్రభుత్వం సుకన్య సమృద్ధి ఖాతాపై మూడు నెలలకొసారి వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది. ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఖాతాలో డబ్బును తీసుకునే వీలుంటుంది. అయితే ఈ ఖాతాలో ప్రతి నెల పదో తేదీ కంటే ముందు నగదు డిపాజిట్ చేస్తే నెలంతటికీ వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధిపై వడ్డీ రేటును ప్రభుత్వ నిర్ణయిస్తుంది కాబట్టి ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వడ్డీ రేట్లు ఉంటాయి.అమ్మాయిల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. వారి ఫ్యూచర్ గురించి చాలా మదనపడుతుంటారు. అయితే చాలామందికి ఈ స్కీమ్ గురించి తెలియదు. ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి.