ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పై విమర్శలు చేసిన కేశినేని నాని..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 12:42 PM

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థ తీరును తప్పుపడుతూ పార్లమెంటు ప్రాంగణంలో నిన్న వైసీపీ ఎంపీలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని స్పందిస్తూ, ఏ అంశం మీదనైనా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే దానికి కేంద్రం ఆమెదం తెలపడం ఆనవాయతీ అని చెప్పారు. దానికి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.


జగన్ గారూ రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం మీ ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సి వాటిపైన పోరాటం చేయాలని కేశినేని హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com