ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికి ఉంది : సీఎం రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 12:32 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికి ఉందని అన్నారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం మంచిది కాదన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ఏపీ పోలీసుల తీరు మారట్లేదని, అరెస్ట్ చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని సీఎం రమేష్‌ డిమాండ్ చేశారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరిగిందని సీఎం రమేష్‌ విమర్శించారు. మతపరమైన అంశాల్లో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com