బిజీ స్టేషన్ల నుండి రైళ్లు ఎక్కే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. భారత రైల్వే త్వరలో "టోకెన్ యూజర్ ఫీజు" విధించడం మొదలు పెట్టనుంది. దీనివల్ల మొత్తం ఛార్జీలు స్వల్పంగా పెరుగుతాయి. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి మరియు స్టేషన్ మౌలిక సదుపాయాల యొక్క ఆధునికత కోసం వసూలు చేయబడే వినియోగదారు రుసుము టికెట్ లో చేర్చబడుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.
వాస్తవానికి ఇప్పటి వరకు విమాన ప్రయాణాలకు మాత్రమే ఇది ఉండేది. "మేము వినియోగదారు ఛార్జీ కోసం చాలా తక్కువ మొత్తాన్ని విదిస్తున్నాం. యూజర్ ఛార్జీ కోసం నోటిఫికేషన్ ఇస్తాం. యూజర్ చార్జీ స్టేషన్ల లోని ప్రయాణీకులకు రైల్వేల ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగించబడుతుంది "అని రైల్వే బోర్డు సిఇఒ మరియు చైర్మన్ వికె యాదవ్ చెప్పారు.