ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 11:54 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.కర్నూలు జిల్లాలో భూ అక్రమాలు, భూదందాల పై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టండి.ఇత్తిన ప్లాంటేషన్ కంపెనీ భూములను తిరిగి రైతులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టండి.గత 13 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆస్పరి, చిన్న హోతూరు, పెద్ద హోతూరు, మరకట్లు గ్రామాల్లో సన్న, చిన్న కారు రైతులు నుండి 450 ఎకరాల భూములను అతి చౌకగా ఇత్తిన కంపెనీ కొనుగోలు చేసింది.


ఆస్పరిలో పరిశ్రమ ఏర్పాటు చేసి, భూములిచ్చిన రైతుల ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఇత్తిన ప్లాంటేషన్ కంపెనీ హామీ ఇచ్చిందికొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఆ భూములను ప్రస్తుత రాష్ట్ర మంత్రి కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో లావాదేవీలు జరిగినట్లు, ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.రెండేళ్లలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అనుమతులు రద్దుచేస్తూ ఏపీఐఐసి నోటీసులివ్వటం గమనార్హం.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com