పులివెందుల : మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో సీబీఐ అధికారులు వేసిన పిటిషన్ను న్యాయమూర్తి గురువారం పరిశీలించారు. దానిని నేర విభాగానికి పంపించారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్పై శుక్రవారం విచారణ జరపనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాంత్ను ఒక ప్రత్యేక గదిలో వారు కలిసి సుమారు అరగంటపాటు చర్చించారు. అనంతరం సీబీఐ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కలిసి ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఈ నెల 13వ తేదీన ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందులకు రాగా.. ప్రస్తుతం మరో ఇద్దరు వచ్చారు.