ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా హత్య కేసు విచారణలో సీబీఐపిటిషన్‌పై నేడు విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 11:46 AM

పులివెందుల : మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందులలోని జూనియర్‌ సివిల్‌ కోర్టులో సీబీఐ అధికారులు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి గురువారం పరిశీలించారు. దానిని నేర విభాగానికి పంపించారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీకాంత్‌ను ఒక ప్రత్యేక గదిలో వారు కలిసి సుమారు అరగంటపాటు చర్చించారు. అనంతరం సీబీఐ అధికారులు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో కలిసి ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఈ నెల 13వ తేదీన ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందులకు రాగా.. ప్రస్తుతం మరో ఇద్దరు వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com