వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రకటన చేయనున్నారు. మంగళవారం ఈ అంశంపై లోక్సభలో ఆయన ప్రసంగించారు. ఏకపక్షంగా సరిహద్దును మార్చేందుకు పొరుగు దేశం చైనా ప్రయత్నిస్తున్నదని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఆరోపించారు. ఆ దేశంతో పలుదఫాలుగా చర్చలు జరిగినప్పటికీ సరిహద్దును నిర్ణయించే విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. చైనా మొండివైఖరితోనే వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరిగాయని స్పష్టం చేశారు. చైనా ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. రెండు ఆసియా దిగ్గజాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయడానికి తీసుకున్న దౌత్య, సైనిక చర్యలను కూడా ఆయన వివరించారు. బుధవారం జరిగిన ఆల్పార్టీ మీటింగ్లో ఈ అంశంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్సభలో బీజేపీ నేత థావర్ చంద్ గెహ్లాట్, మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్, రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్, ఎంపీలు ఆనంద్ శర్మ, తిరుచి శివ (డీఎంకే), డారెక్ ఓబ్రెయిన్ (టీఎంసీ), రామ్ గోపాల్యాదవ్ (సమాజ్వాది పార్టీ), కే కేశవరావు (టీఆర్ఎస్) హాజరయ్యారు.