ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక తాగనని వేడుకున్నా కరగని భార్య.. భర్త ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 15, 2020, 04:13 PM

మద్యానికి బానిసగా మారిన భర్తతో కలిసి బతకలేక విడిచి వెళ్లిపోయింది భార్య. అలిగి పుట్టింటికెళ్లిన భార్యని ఎలాగైనా తీసుకురావాలని భావించాడు భర్త. ఇకపై తాగనంటూ వేడుకున్నాడు. అయినా ఆమె మనసు కరగలేదు. తాను రానని తెగేసి చెప్పడంతో తట్టుకోలేకపోయిన భర్త తనువు చాలించాడు. ఈ అత్యంత విషాద ఘటన చిత్తూరులో చోటుచేసుకుందని టీఓఐ కథనం పేర్కొంది.
నగరంలోని బ్రాహ్మణవీధికి చెందిన దిలీప్(38)కి కోడికుంటకి చెందిన మోనిషాతో ఏడేళ్ల కిందట వివాహమైంది. పూల వ్యాపారం చేసే దిలీప్ క్రమంగా మద్యానికి బానిసగా మారాడు. భర్త నిత్యం తాగి వస్తుండడంతో మోనిషా గొడవపడేది. ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండడంతో ఇక భర్తలో మార్పు రాదని భావించిన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యం తాగి పాడైపోతున్న కొడుకుని చూసి తట్టుకోలేక అతని తల్లిదండ్రులు దిలీప్‌ని కౌన్సిలింగ్ సెంటర్‌లో చేర్పించారు.
ఇంతలో అనారోగ్యం పాలైన భర్త ఆస్పత్రికి వెళ్తే మరుసటి రోజు రమ్మన్నారు. బాధలో ఉన్న దిలీప్ తన భార్యకి ఫోన్ చేసి కాపురానికి రావాలని కోరాడు. ఇకపై తాగనని.. ఇంటికి వచ్చేయాలని వేడుకున్నాడు. అయినా మనసు కరగని భార్య రానని స్పష్టం చేయడంతో తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. ఇంటికెళ్లి ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com