అనంతరపురం జిల్లా తాడిపత్రి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూయిజర్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న పది మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా డ్రైవర్తో సహా ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని తిరుచానూరులో ఓ ఆధ్యాత్మిక గురువు మృతి చెందడంతో ఆయన అంతక్రియలకు హాజరై వాహనంలో తిరిగి వస్తుండగా తెల్లవారుజూమున ప్రమాదం జరిగింది. మృతులు, క్షతగాత్రులంతా తాడిపత్రి వాసులేనని తెలుస్తోంది. డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.