కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులమంటూ కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిందితులు రూ. 14 లక్షలు వసూలు చేశారు. పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు, పరారీలో మరో ఇద్దరు ఉన్నారు. 80 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ట్రైనీ ఐపియస్ అధికారి కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, ఏసిబి అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడ్డ 6 మంది నిందితులు అరెస్టు చేసినట్లు తెలిపారు.