ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ అధినాయకత్వంపై మరోసారి వ్యాఖ్యలు చేసిన అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 04:04 PM

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధినాయకత్వంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జనం ఎప్పుడో మర్చిపోయారని, అందుకే ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని, ఏపీలో ప్రతిపక్షం ఉన్నట్టు మాత్రం భ్రమలు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.


ఏపీ ప్రజలకు ప్రతిపక్షం ఎప్పుడో దూరమైందని, హైదరాబాదుకే పరిమితమైన చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా రాజకీయాలు చేస్తూ జూమ్ బాబు అయ్యారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆరోపించారు. అటు, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పైనా అంబటి విమర్శలు చేశారు. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తూ ట్విట్టర్ బాబు అయ్యారని వ్యంగ్యం ప్రదర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com