కరోనా కాలంలో దేశంలో అన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశాన్నితాకుతున్నాయి. ఇక ప్రోటీన్ ఆహారమైన చికెన్, మటన్ ధరల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కిలో చికెన్ ధర రూ.300, మటన్ ధర రూ.800 వరకు ఉన్నది. ధరలు చుక్కల్లో ఉండటంతో చికెన్, మటన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. జీతాల్లో భారీ కోతలు పడుతున్నాయి. ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు వినియోగించి చికెన్, మటన్ ను కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే, కడప జిల్లా పుల్లంపేట మండలంలో గత వారం రోజులుగా కిలో మటన్ రూ.500కి అమ్ముతున్నారు. చవకగా మటన్ అమ్ముతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పుల్లంపేటకు చేరుకొని మటన్ ను కొనుగోలు చేస్తున్నారు.