ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక మూల మహిళలపైనా చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటు చేసుకుంది. బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వాధికారి కామాంధుడిలా మారాడు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని మైలవరం వీఆర్ఏ నాగమునయ్య తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఆలయం వెనక వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అరుపులతో స్థానికులు వచ్చి అతనికి దేహశుద్ది చేసారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నాగమునయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.