కడప జిల్లాలోని మైలవరంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై వీఆర్ఏ నాగమునయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి స్థానిక రామాలయం ఆవరణలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం స్థానికులకు తెలియడంతో నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా మునెయ్య మైలవరంలోనే వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. మునెయ్యను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.