కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఉయ్యాలవాడ మండలంలో పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారి రఘుబాలపుల్లయ్య రైతులకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఎద్దులు, ఆవులు, తదితర జీవాలకు జోరీగలు కుట్టడం వల్ల వ్యాధి సోకుతుందన్నారు.జోరీగల బారిన పడిన పశువుల నుంచి మరొక పశువుకు వైరస్ విస్తరిస్తుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు జ్వరం వచ్చి మేత తినకపోవడం, చర్మంపై దద్దుర్లు, పశువుకు ముందు, వెనుకవాపు వస్తుందన్నారు. ఈ లక్షణాలు ఉన్న పశువులను మూడు నుంచి 15 రోజుల పాటు చికిత్స చేయిస్తే కోలుకుంటాయన్నారు.