ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులపై దాడి కేసు.. పరారీలో మంత్రి బంధువు నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 09:48 PM

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో పోలీసులపై దాడి కేసులో మంత్రి బంధువు నారాయణ పరారీలో ఉన్నారు. గుమ్మనూరులో పేకాడుతూ గురువారం పట్టుబడిన 32 మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో.. చిప్పగిరి పోలీస్ స్టేషన్​లో విచారణ జరుగుతోంది.మంత్రి జయరాం బంధువు నారాయణ సహా 35 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ చిప్పగిరి మండలం వైకాపా కన్వీనర్​గా ఉన్నారు. అలాగే వైకాపా నాయకులు శ్రీధర్, అజయ్​లు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఆ ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com