గత దాళ్వా పంట బకాయిలు నేటికీ చెల్లించలేదు..రూ.300 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. రైతు అమ్మిన ధాన్యానికి సొమ్ము చెల్లించలేని అసమర్థత ప్రభుత్వానికి మూడు ముక్కల రాజధానుల సోకులు అవసరమా? అని ప్రశ్నించారు. రైతు దినోత్సవాలు అంటూ ప్రకటనలు కాదు.. బకాయిలు చెల్లించాలన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు జీవోలు తప్ప వార్షిక కౌలు చెల్లించకపోవడం దారుణమన్నారు.