ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 32 లక్షల విలువైన 400 కేజీల గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. విశాఖ జిల్లా, నర్సిపట్నం నుంచి కృష్ణాజిల్లా, విస్సన్నపేటకు తరలిస్తుండగా పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.