ఆదోని పట్టణంలో 32, రూరల్లో 22 కేసులతో నియోజకవర్గంలో ఆదివారం 54 కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఖూనీమొహల్లా 1, రాంజల రోడ్ 5, బావాజీ పేట 3, రాయనగర్ 1, ఇందిరా నగర్ 2, ఎస్ఎస్ నగర్ 2, ఎస్కెడి కాలనీ 2, మరాఠీ వాడి 2, హటేలీ లైన్ 1, వైఎస్ఆర్ నగర్ 2, ఎంఎం రోడ్ 1, ఆర్టిసి కాలనీ 1, బండిమెట్ట 2, క్రాంతినగర్ 7, రూరల్లో తిరుమలనగర్ 1, శ్రీరామ్నగర్ 5, మండిగిరి 11, బాబాగార్డెన్ 1, కడితోట 1, దొడ్డనగేరి 2, బసాపురం 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి మందులేదని, స్వీయ జాగ్రత్తలు పాటించి కుటుంబాలను రక్షించుకొని సమాజాన్ని కాపాడుకుందామని అధికారులు సూచిస్తున్నారు. కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చి ఒకరి ప్రాణాన్ని కాపాడండి.