కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గడిచిన 24 గంటల్లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు మొత్తం 1083 కరోనా కేసులు చేరుకున్నాయి. అందులో 126 మంది యాక్టివ్ లో ఉండగా కరోనా చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 950 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పోరాడి ఇప్పటి వరకు 16 మంది మరణించారు అని తెలిపారు.