పాణ్యం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రం అయిన ఓర్వకల్ గ్రామంలోని పెండేకంటి నగర్ లో వర్షం కారణంగా రోడ్లు మొత్తం అస్తవేస్తంగా మారాయి, కనీసం నడవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుతున్నారు కాలనీ వాసులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దృష్టికి తీసుకోపోగా వెంటనే స్పందించి ఆయన అక్కడ పర్యటించి త్వరలో నూతన రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.