కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణాన్ని మున్సిపల్ అధికారులు అంధకారం చేశారని సీపీఐ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు డి.శ్రీనివాసులు ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్.షరీఫ్ భాష మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో దాదాపుగా రెండు నెలలుగా వీధిలైట్లు వెలగక గాంధీ చౌక్ నుంచి నూనెపల్లె వరకు అలాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, సంజీవనగర్ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు వీధి లైట్ల వెలుతురు లేక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఆయా వీధుల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పర్యటించిన వారు మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. గత మూడు రోజులుగా వర్షం పడుతుందని, వర్షం నీళ్ళు పక్క డ్రైనేజీ కాలువల ద్వారా నిండి నీళ్లు నిలబడి మోకాలి లోతు నిల్వ ఉన్నాయన్నారు. అలాగే వీధి దీపాలు వెలగక అంధకారంలో పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు వీధి లైట్లు వేసి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ తరుపున డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలో దోమలు వ్యాప్తి ఎక్కువగా ఉందనీ వాటి ద్వారా ప్రజలకు అంటువ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారన్నారు. వెంటనే దోమల నివారణ చేపట్టాలన్నారు. ఖాళీగా ఉన్న స్థలాలలో నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.