కర్నూలు జిల్లా శ్రీశైలంలోని ఆలయం వెనుక భాగాన ఉన్న దత్త సాయి (మౌనస్వామి) సేవా ఆశ్రమంలో శుక్రవారం శ్రీ అరబిందో గురుదేవుల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గురువుగారి చిత్ర పటాలకు పూజలు నిర్వహించి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.ఈ సందర్భంగా మౌన స్వామి మాట్లాడుతూ కరోనా కట్టడి లో భాగంగా ఉత్సవాలు నిరాడంబరంగా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు గురువారం నుండి సోమవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ అధ్యక్షులు వెంకన్న బాబు తెలిపారు. అనంతరం సాధువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.