కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ఆదేశాల మేరకు రేపు 74 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం తనిఖీలు చేపట్టారు.ఈ సంధర్బంగా శుక్రవారం సాయంత్రం బాంబ్, డాగ్ స్క్వాడ్ల బృందాలు రైల్వేస్టేషన్, ఆర్టీసి బస్ స్టాండ్ , కలెక్టర్ ఆఫీసు, డిఐజి ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, మరియు ఇతర రద్దీ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.