ఎందరో సమర యోధులు తమ ప్రాణాలు సైతం తృణ ప్రాయంగా దేశం కోసం త్యాగాలు చేసిన ప్రతిఫలంగా నేడు స్వాతంత్రం అనుభవిస్తున్నామని ఆదోని నియోజకవర్గ తెలుగు యువత నాయకులు భూపాల్ చౌదరీ అన్నారు. శనివారం ఆదోని పట్టణ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అందరికి 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాల్ చౌదరీ మాట్లాడుతూ.. స్వాతంత్రంలో ప్రాణాలర్పించిన త్యాగధనుల స్ఫూర్తిని దేశ పౌరులకు కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. నేటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ స్వార్థం, నైపుణ్యం లేని విద్య విధానాలు, పేదల ఆకలి చావులు తదితర పరిస్థితులు నేటికీ మారలేదన్నారు. ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.