కర్నూలు జిల్లా కోసిగి కోండలో పులి సంచరిస్తూనట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, జంతువులు పులి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. బసవన్న కోండ, తిమ్మప్ప కోండ, సత్యమ్మవ్వ కోండ కింద ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవరు కూడా బయపడవద్దని, ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటూ, పులి సంచరిస్తూనట్లు ఆనావాలు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు లేదా స్థానిక పోలీసు అధికారులకు తెలియ పరచగలరని కోరారు. గోర్రెల, మేకల కాపాలదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అటవీశాఖ యస్ఐ చంద్రశేఖర్ నాయక్ అద్వర్యంలో గాలింపు బృందం ఏర్పాటు చేశారని తెలిపారు. ఫారెస్టు రేంజ్ అధికారి జయరాముడు, యస్ఐ ధనుంజయతో పోన్లో సంప్రదించి తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.