కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిధిలోని గోరంట్ల గ్రామ సచివాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కోవిడ్ నిభందనలను పాటిస్తూ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భాంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ 74 సంవత్సరాలలో మన దేశం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొటూ వాటిని అధిగమిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం మన దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కోవిడ్-19. ఈ కరోనా నుంచి త్వరగా దేశం కోలుకొని, దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.