ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత రాజ్యాంగాన్ని, దేశ స్వతంత్రతను కాపాడుకుంటామని సీపీఎం, సీపీఐ ప్రతిజ్ఞ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 06:39 PM

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఐకమత్యంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్రాన్ని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని, స్వతంత్రతను కాపాడటంలో పూర్తిగా విఫలం చెందిందని, వాటిని కాపాడేందుకు ప్రతి పౌరుడు ముందుండాలని సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ నాయకులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా... సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు బాబా ఫక్రుద్దీన్, సిపిఎం జిల్లా నాయకులు మస్తాన్ వలి, నరసింహా, సిపిఐ నాయకులు శ్రీనివాసులు, సోమన్న, షరీఫ్ భాష, సిపిఎం పట్టణ నాయకులు వెంకట లింగం, శివలతో పాటు ప్రజా సంఘాల నాయకులు రామరాజు, నిరంజన్, సుబ్బారావు, వీరసేనలతో పాటు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com