కర్నూలు జిల్లా శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంకు పది కిలోమీటర్ల దూరంలో శిఖరం సమీపాన శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం దర్శనానికి వస్తున్న యాత్రికుల కారుని సున్నిపెంట నుంచి వస్తున్న జీపు ఢీకొనడంతో ఇద్దరు మహిళలకి తీవ్ర గాయాలు కాగా... ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శ్రీశైల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలం ప్రకాశం జిల్లా పరిధిలోనిది కావడంతో దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.